18 కోట్ల పాన్కార్డులకు మంగళం.. ఆధార్ అనుసంధానం చేయని ఫలితం!
- ఆధార్-పాన్ అనుసంధానానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువు
- ఇంకా అనుసంధానం కాని 18 కోట్ల పాన్కార్డులు
- కొందరి వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్కార్డులు ఉన్నాయన్న ఐటీశాఖ
ఒకటి కన్నా ఎక్కువ పాన్కార్డులు కలిగిన వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో లావాదేవీలు జరిపే వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు ఐటీశాఖ తెలిపింది. కొందరు విలాసవంతంగా ఖర్చు చేస్తూ పన్నులు ఎగవేసేందుకు ఒకటి కంటే ఎక్కువ పాన్కార్డులను ఉపయోగిస్తున్నట్టు పేర్కొంది. పాన్కార్డును ఆధార్తో అనుసంధానిస్తే ఒకటి కంటే ఎక్కువ పాన్కార్డులు పొందే అవకాశం ఉండదని తెలిపింది. కాబట్టే పాన్ను ఆధార్తో అనుసంధానించేందుకు వారు వెనకడుగు వేస్తున్నట్టు పేర్కొంది.