Corona Virus: దేశంలో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి.. తాజా అప్‌డేట్స్

New Cases india 68898
  • 24 గంటల్లో 68,898  మందికి కరోనా 
  • మొత్తం కేసులు 29,05,824
  • మృతుల సంఖ్య మొత్తం 54,849
  • 6,92,028 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
దేశంలో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 68,898 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 983 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 29,05,824 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 54,849కి పెరిగింది. ఇక 6,92,028 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 21,58,947 మంది కోలుకున్నారు.
                                                                               
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,34,67,237 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,05,985 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID-19
India

More Telugu News