Sushant Singh Rajput: సుశాంత్ సింగ్‌ కేసులో కీలక పరిణామం.. సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court directs CBI to investigate Sushant Singh Rajput death case
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. బీహార్, మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో సమన్వయం, సహకారం లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది.  ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం ( సీబీఐ)కి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వం ఇప్పటికే సిఫారసు చేసింది.

అంతేగాక, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం కూడా తెలిపింది. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ అంశంపై ఈ రోజు సుప్రీం కోర్టు తమ నిర్ణయాన్ని తెలిపింది.

ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులకు ఆదేశించింది. కాగా, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తోన్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందిస్తూ... 'సీబీఐ జయహో' అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Sushant Singh Rajput
Supreme Court

More Telugu News