అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. షాక్ లో అభిమానులు!
- కీలక ప్రకటన చేసిన ధోనీ
- అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన క్రికెట్ దిగ్గజం
- గత కొన్ని రోజులుగా ధోనీ రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ
రిటైర్మెంట్ విషయాన్ని ఇన్స్టా గ్రామ్ ద్వారా ధోనీ వెల్లడించాడు. 'మీ అందరి ఎనలేని ప్రేమాభిమానాలకు, మద్దతుకు ధన్యవాదాలు. ఈ సాయంత్రం 7.29 గంటల నుంచి నా రిటైర్మెంట్ అమల్లోకి వస్తుంది' అని క్లుప్తంగా తెలిపాడు.
2019 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్స్ ధోనీ ఆడిన చివరి మ్యాచ్. ఆ మ్యాచ్ లో ఇండియా ఓటమిపాలై, టోర్నీ నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి ధోనీ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది.