KTR: బెంగళూరులో హింసపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందన.. నెటిజన్లకు సూచన

KTR dont indulge in propaganda  stop spreading fake news
  • సామాజిక మాధ్యమాల్లో చేసే నకిలీ ప్రచారం ప్రమాదకరం
  • బాధ్యతగా ఉండాలని కోరుతున్నాను
  • ఇటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు
  • రెచ్చగొట్టే చర్యలకు సామాజిక మాధ్యమాలను వాడొద్దు 
కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ ఫేస్‌బుక్‌లో ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేయగా వివాదం రాజుకుని అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 110 మందికి పైగా అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్టులు ఎంతటి పరిణామాలకు దారి తీస్తాయో తెలిపే ఈ ఘటనకు సంబంధించిన వార్తను పోస్ట్ చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటువంటి న్యూస్ ప్రచారం చేయొద్దని సూచించారు.

'సామాజిక మాధ్యమాల్లో చేసే నకిలీ ప్రచారం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలుపుతోంది. బాధ్యతగా ఉండాలని సామాజిక మాధ్యమాలను వాడే అందరినీ నేను కోరుతున్నాను. ఇటువంటి ప్రచారాలు చేయొద్దు, నకిలీ వార్తలను ప్రచారం చేయడం ఆపండి. అసాంఘిక చర్యలను రెచ్చగొట్టే సాధనంగా సామాజిక మాధ్యమాలను వాడొద్దు' అని కేటీఆర్ సూచించారు.
KTR
TRS
Telangana
Karnataka

More Telugu News