Ticks Borne Virus: చైనాలో పుట్టుకొచ్చిన మరో కొత్త వైరస్... ఇప్పటికే ఏడుగురి బలి!

China suffered with ticks borne virus
షార్ట్స్‌లో చూడండి
కరోనా వంటి మహమ్మారి వైరస్ ను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలో ఇప్పుడు ఓ కొత్త రకం వైరస్ దాడి చేస్తోంది. ఈ వైరస్ రక్తంపీల్చే పినుజులు (టిక్స్) వంటి జీవుల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్టు  గుర్తించారు. ఇప్పటికే ఈ నూతన వైరస్ బారినపడి ఏడుగురు మరణించారు. తూర్పు చైనాలోని జియాంగ్సు, అన్హుయి ప్రావిన్స్ ల్లో దీని ప్రభావం గణనీయంగా ఉంది. 60 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.  ఈ వైరస్ ను ప్రస్తుతానికి టిక్ బోర్న్ వైరస్ (టీబీవీ), లేదా నావెల్ బున్యా వైరస్ గా పేర్కొంటున్నారు.

సాధారణంగా కుక్కలు, పిల్లుల వంటి జంతువులను అంటిపెట్టుకుని, వాటి రక్తం పీల్చుతూ బతికే ఈ పినుజులు 83 రకాల వైరస్ లకు ఆవాసాలుగా ఉన్నాయని గుర్తించారు. ఈ వైరస్ సోకితే మనుషుల్లో తీవ్ర జ్వరం కలుగుతుంది. సరైన చికిత్స అందకపోతే మృత్యువు కబళించడం ఖాయం.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కరోనా వైరస్ గురించి సకాలంలో ప్రపంచానికి సమాచారం అందించలేదని అపవాదు ఎదురొన్న చైనా ప్రభుత్వం, ఈ కొత్త వైరస్ విషయంలో ఆ పొరపాటు లేకుండా తన అధికారిక పత్రికలో వెల్లడించింది. సహజసిద్ధంగా వ్యాపిస్తున్న కొత్త అంటువ్యాధి అని పేర్కొంది. ఈ కొత్త వైరస్ తో కలిగిన మరణాలను మొదట డెంగ్యూ, ఇతర దోమకాటు వ్యాధుల కారణంగా సంభవించి ఉండొచ్చని భావించారు. అయితే ఈ మరణాలకు దోమకాటు కారణం కాదని, పినుజుల ద్వారా వ్యాప్తి చెందే నావెల్ బున్యా వైరస్ కారణమని ఆరోగ్య నిపుణులు నిర్ధారించారు.
Go Back to Shorts
Ticks Borne Virus
China
Novel Bunya Virus
Corona Virus

More Telugu News