సీమ పౌరుషం ఉంటే జగన్ మా సవాల్ స్వీకరించాలి: పట్టాభి
- టీడీపీ, వైసీపీ మధ్య రాజధాని రగడ
- అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళదాం అంటూ చంద్రబాబు సవాల్
- చంద్రబాబు మళ్లీ మీడియా ముందుకు వస్తారన్న పట్టాభి
"చంద్రబాబు విసిరిన సవాల్ కు స్పందించాల్సిందే. ఏమైంది సీమ పౌరుషం? పులివెందుల పులి అని చెప్పుకుంటుంటారు కదా. పులివెందుల పులి ఇవాళ పిల్లిలా మారిపోయిందా? పిల్లిలా మారిపోయి ఏ ప్యాలెస్ లో దాక్కుంది సార్! ఎందుకు బయటకు రాలేకపోతోంది ఈ పులి?
అనిల్ కుమార్ యాదవ్ కు, బొత్స సత్యనారాయణకు, పేర్ని నానికి కూడా సవాల్ విసురుతున్నా... పులి వేషాలు వేసుకున్నట్టు మీడియా ముందుకు వచ్చి రంకెలు వేయడం కాదు... నిజంగా దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి వెళదాం రండి. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదు. మీ నిర్ణయాన్ని మీరు వాపసు తీసుకోకపోతే రేపు సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు మీడియా ముందుకు వస్తారు. మీరు దిగివచ్చేవరకు మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటారు. జగన్ ఇప్పటికైనా సీమపౌరుషం ఉన్న ఒక మనిషిగా రుజువు చేసుకోండి" అంటూ పట్టాభి నిప్పులు చెరిగారు.