సీఎం జగన్ హింసించే రాజు పులికేసిని తలపిస్తున్నారు: లోకేశ్
- రాజధానిలో మరో రైతు గుండె ఆగిందన్న లోకేశ్
- రైతుల ఉసురు జగన్ కు తప్పకుండా తగులుతుందని వ్యాఖ్యలు
- మూర్ఖత్వానికి మానవరూపం జగన్ అంటూ విమర్శలు
"మూర్ఖత్వానికి ప్రతిరూపం వైఎస్ జగన్. 79 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్నా ఆయన అహం చల్లారలేదు. 14 నెలల్లో ఏ ప్రాంతంలోనూ ఒక్క ఇటుకైనా పెట్టని జగన్ రెడ్డి, మూడు రాజధానులు నిర్మిస్తానంటూ హింసించే రాజు పులికేసిని తలపిస్తున్నాడు" అంటూ విమర్శించారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్లు చేశారు.