ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన కృష్ణా బోర్డు
- రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుకెళ్లొద్దు
- కేంద్ర జల సంఘం అపెక్స్ కౌన్సిల్ కు నివేదిక పంపండి
- అక్కడి నుంచి ఆనుమతులు వచ్చాకే నిర్మాణాన్ని ప్రారంభించండి
కేంద్ర జల సంఘం అపెక్స్ కౌన్సిల్ కు నివేదికను పంపాలని... అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని తెలిపింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు కృష్ణా బోర్డు కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంపై నీళ్లు చల్లినట్టైంది.