ఏపీలోని వివిధ వర్సిటీల వైస్ చాన్సలర్ల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలు

  • యూనివర్సిటీలకు కొత్త వీసీలు
  • నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
  • దేశంలోని వివిధ వీసీలకు సెర్చ్ కమిటీల్లో స్థానం
ఏపీలోని వివిధ విశ్వవిద్యాలయాలకు నూతన వైస్ చాన్సలర్ల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీలను నియమించింది. సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్లను ఎంపిక చేసే బాధ్యత ఈ సెర్చ్ కమిటీలకు అప్పగిస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దేశంలోని వివిధ వర్సిటీల వీసీలను ఈ సెర్చ్ కమిటీల్లో యూజీసీ నామినీలుగా నియమించారు.

Search Committees
Vice Chancellors
Universities
Andhra Pradesh

More Telugu News