Corona Virus: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

Corona spreading continues in Telangana
  • కొత్తగా 1,640 పాజిటివ్ కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 683 మందికి కరోనా
  • మరో 8 మంది మృతి
  • ఇవాళ 1,007 మంది డిశ్చార్జి
తెలంగాణలో కరోనా వైరస్ భూతం విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 1,640 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 52,466కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎప్పట్లాగానే భారీ సంఖ్యలో కరోనా కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 683 మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో మరో 8 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 455కి పెరిగింది. ఇవాళ 1,007 మంది డిశార్జి కాగా, ఇంకా 11,677 మంది చికిత్స పొందుతున్నారు.

.
Corona Virus
Telangana
Positive
Deaths
COVID-19

More Telugu News