తెలంగాణలో కొత్తగా 1,478 కరోనా కేసులు

  • జీహెచ్ఎంసీ పరిధిలో 806 కొత్త కేసులు
  • తాజాగా 1,410 మంది డిశ్చార్జి
  • గత 24 గంటల్లో ఏడుగురు మృతి
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,478 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 42,496కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 806 కొత్త కేసులు వచ్చాయి. ఇవాళ 1,410 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 28,705కి పెరిగింది. ప్రస్తుతం 13,389 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో తాజాగా ఏడుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో మొత్తం మరణాలు 403కి పెరిగాయి.


.

Corona Virus
Telangana

More Telugu News