నాలుగు నెలల తర్వాత  హైదరాబాద్ చేరుకున్న రకుల్

Rakul Preet Singh reaches Hyderabad after 4 months
  • కరోనా వల్ల ముంబైలో ఉండిపోయిన రకుల్
  • 20 రోజులు గురుగావ్ లో తల్లిదండ్రులతో గడిపిన హర్యానా భామ
  • రకుల్ కు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం
కరోనా నేపథ్యంలో ముంబైలోను, గురుగావ్ లోనూ ఉండిపోయిన సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకుంది. దాదాపు 4 నెలల తర్వాత భాగ్యనగరానికి విచ్చేసింది. ఈ సందర్భంగా రకుల్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని వెల్లడించింది.

తన సొంత రాష్ట్రం హర్యానా కంటే హైదరాబాదే తనకు చాలా ఇష్టమని రకుల్ గతంలో తెలిపింది. అందుకే ఇక్కడే సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం నితిన్ సరసన రకుల్ నటిస్తోంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు, దాదాపు 3 నెలల తర్వాత ముంబై నుంచి ఆమె గురుగావ్ కు వెళ్లింది. అక్కడ తన తల్లిదండ్రులతో కలిసి 20 రోజుల పాటు గడిపింది. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంది.
Go Back to Shorts
Rakul Preet Singh
Hyderabad
Tollywood

More Telugu News