కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం: రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పూనియా
- రాజకీయ సంక్షోభానికి బీజేపీ కారణమన్న గెహ్లాట్
- కాంగ్రెస్ కలహాల్లో జోక్యం చేసుకోబోమన్న పూనియా
- సచిన్ ఎత్తుగడపై సర్వత్ర ఆసక్తి
మరోవైపు, రాష్ట్రంలోని సంక్షోభానికి బీజేపీయే కారణమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అంగట్లో సరుకులా కొనేందుకు ప్రయత్నిస్తోందని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 30 కోట్లు ఆఫర్ చేస్తోందని ఆరోపించారు.
కాగా, నేడు జరిగిన సీఎల్పీ సమావేశానికి కూడా అసంతృప్త నేత సచిన్ పైలట్ గైర్హాజరు కావడంతో రాజస్థాన్ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలతో వీడియో విడుదల చేసిన పైలట్.. బీజేపీలో చేరబోనని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయనేం చేయబోతున్నారన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.