ఇంగ్లాండ్ ను వెస్టిండీస్ చిత్తు చేయడంపై కోహ్లీ స్పందన!
- కరోనా పంజా విసిరిన తర్వాత ప్రారంభమైన క్రికెట్ సందడి
- తొలి టెస్టులో ఇంగ్లాడ్ పై వెస్టిండీస్ విజయం
- అత్యద్భుతమైన టెస్ట్ క్రికెట్ అని కితాబిచ్చిన కోహ్లీ
కరోనా నేపథ్యంలో, కొత్త కోవిడ్ రూల్స్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందించింది. సౌథాంప్టన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్ ను విండీస్ నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ లో విండీస్ 1-0 లీడ్ ను సాధించింది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విండీస్ పై ప్రశంసలు కురిపించాడు. 'వావ్ వెస్టిండీస్... వాటే విన్. అత్యద్భుతమైన టెస్ట్ క్రికెట్' అని ట్వీట్ చేశాడు.