Corona Virus: కృష్ణా, కర్నూలు జిల్లాల్లో కరోనా మృత్యుఘంటికలు... ఏపీలో కొత్తగా 462 మందికి పాజిటివ్

Corona virus spreads rapidly in AP
  • 119కి చేరిన కరోనా మరణాలు
  • ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,834
  • తాజాగా 129 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా రక్కసి మరింతగా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు కరోనాతో మరణించారు. అటు కర్నూలు జిల్లాలోనూ ముగ్గురు ఈ మహమ్మారికి బలయ్యారు. గుంటూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు మరణించగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 119కి పెరిగింది. ఇక, కొత్తగా 462 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 40 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 15 మంది ఉన్నారు. దాంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,834కి చేరింది. 129 మందిని డిశ్చార్జి చేయగా, మొత్తం  4,592 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది. ఇంకా 5,123 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Corona Virus
Andhra Pradesh
Positive Cases
Deaths
COVID-19

More Telugu News