భారత్-చైనా ఘర్షణ: 20 మంది భారత సైనికులు, 43 మంది చైనా సైనికుల మృతి?
- ఐదు దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో ఘర్షణ
- వాస్తవాధీన రేఖను దాటేందుకు యత్నించిన చైనా బలగాలు
- ఇరు దేశాల సైనికుల బాహాబాహీ, రాళ్ల దాడి
నిజానికి ఈ ఘటనలో ఇరు దేశాలు సైనికులను భారీగానే నష్టపోయినట్టు తెలుస్తోంది. భారతదేశం 20 మంది సైనికులను పోగొట్టుకోగా, చైనా వైపు ఏకంగా 43 మంది మరణించినట్టు ‘ఏఎన్ఐ‘ పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ఆర్మీ నిర్ధారించాల్సి ఉంది. 15న రాత్రి చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటేందుకు ప్రయత్నించడంతో భారత బలగాలు అడ్డుకున్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు పేర్కొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నిన్న ప్రధానితో భేటీ కాగా, ఆ తర్వాత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.