తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలన్న కేంద్రం
- దేశవ్యాప్తంగా 38 జిల్లాల్లో కరోనా స్వైరవిహారం
- విరివిగా వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ కేంద్రం సూచన
- పటిష్ట నిఘా చర్యలు తీసుకోవాలని వెల్లడి
మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, కర్ణాటక, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాలని, వైరస్ సంక్రమణం అరికట్టేలా పటిష్టమైన నిఘా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్, ఇతర ఉన్నతాధికారులు సమావేశమై ఆయా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటిండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో మాట్లాడారు.