నిందితురాలికి కరోనా... విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారుల్లో కలకలం!
- ఐసిస్ కుట్రల నేపథ్యంలో సమీ, బేగ్ దంపతులపై విచారణ
- 9 రోజులుగా విచారణ జరుపుతున్న ఎన్ఐఏ
- అనుమానిత లక్షణాలు కనిపించడంతో నిందితురాలికి కరోనా పరీక్ష
హీనా బషీర్ బేగ్ కేసు విచారిస్తున్న అధికారులందరూ క్వారంటైన్ కు వెళ్లాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎన్ఐఏ ఉన్నతాధికారులు ఆదేశించారు. అటు, కరోనా బారినపడిన హీనాను ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తరలించనున్నారు. హీనాకు కరోనా పాజిటివ్ వచ్చినా ఆమె భర్త సమీలో ఎలాంటి అనుమానిత లక్షణాలు లేవని గుర్తించారు.