సీఎం జగన్ ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నారు.. త్వరలోనే ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్తారు: అవంతి శ్రీనివాస్
- దేశంలోనే అత్యున్నత సీఎంగా జగన్ అవతరిస్తారు
- జగన్ ను చంద్రబాబు ఎదుర్కోలేరు
- చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా రాజకీయాలు చేస్తున్నారు
జగన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుర్కోలేరనే విషయం అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్, జూమ్ ద్వారా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ ఎంత బలంగా కొడితే ... అంత బలంగా పైకి లేచే నాయకుడని అన్నారు.
కరోనా వైరస్ గురించి మంత్రి మాట్లాడుతూ, వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని... శానిటైజర్, మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని విన్నవించారు. టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులుగా గెలిచిన తర్వాత ప్రజలకు కనిపించరని... వైసీపీ నేతలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు.