YSRCP: నా మాటలను మీడియా వక్రీకరించింది: వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

  • ఎమ్మెల్యేలకు మాట్లాడే స్వేచ్ఛను జగన్ ఇచ్చారు
  • అసంతృప్తిగా ఉన్నానంటూ తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది
  •  తాను చేసిన వ్యాఖ్యల పట్ల జగన్ వెంటనే స్పందించారు
Jagan has given freedom to all MLAs to speak says Jaggireddy

ఇసుకకు సంబంధించి వైసీపీ తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. రీచ్ నుంచి బయల్దేరిన ఇసుక మధ్యలోనే మాయమైపోతోందని ఆయన అన్నారు. కోనసీమలో ఇసుక ఉన్నా ఇళ్ల నిర్మాణానికి దొరకడం లేదని చెప్పారు.

 ఈ నేపథ్యంలో, జగ్గిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలకు మాట్లాడే స్వేచ్ఛను ముఖ్యమంత్రి జగన్ కల్పించారని చెప్పారు. తాను పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నానంటూ తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు.

పార్టీ అధిష్ఠానం పట్ల వైసీపీ ఎమ్మెల్యేలలో ఎవరికీ అసంతృప్తి లేదని జగ్గిరెడ్డి చెప్పారు. సమస్యలపై చర్చించే స్వేచ్ఛ పార్టీలో ఉందని అన్నారు. ఇసుక విధానంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల జగన్ వెంటనే స్పందించారని చెప్పారు.

More Telugu News