ఎన్టీఆర్ అభిమానులపై నటి మీరా చోప్రా కేసు.. ఢిల్లీకి బదిలీ చేసిన హైదరాబాద్ పోలీసులు!
- తనకు ఎన్టీఆర్ కంటే మహేశ్ బాబు అంటేనే ఇష్టమన్న మీరా చోప్రా
- దుమ్మెత్తి పోస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్ అభిమానులు
- ఎనిమిది ట్విట్టర్ ఖాతాల నుంచి అసభ్యకర సందేశాలు వచ్చినట్టు గుర్తింపు
దీంతో స్పందించిన నటి ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎనిమిది ఖాతాల నుంచే ఆమెకు అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. కాగా, నటి ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా, ‘67ఎ’ను కూడా జతచేశారు. మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు చెప్పారు.