Uttarakhand: ఉత్తరాఖండ్ లో మంత్రి భార్యకు కరోనా... మంత్రికి, సిబ్బందికి క్వారంటైన్

Minister wife tested corona positive in Uttarakhand
  • మంత్రి సత్యపాల్ అర్ధాంగి అమృతా రావత్ కు పాజిటివ్
  • కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అమృతా
  • మంత్రి, ఇతర సిబ్బంది నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు
కరోనా మహమ్మారి ప్రముఖులను సైతం వదిలిపెట్టడంలేదు. తాజాగా ఉత్తరాఖండ్ లోని ఓ మంత్రివర్యుని అర్ధాంగి కరోనా బారినపడ్డారు. ఉత్తరాఖండ్ టూరిజం శాఖ మంత్రి సత్యపాల్ మహారాజ్ భార్య అమృతా రావత్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.

దాంతో మంత్రిని, ఇతర సిబ్బందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారి నుంచి నమూనాలు తీసుకుని వైద్య పరీక్షలు చేయనున్నారు. అమృతా రావత్ గతంలో మంత్రిగా వ్యవహరించారు. ఆమె కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో రిషికేశ్ లోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ఫలితం వచ్చింది.
Uttarakhand
Minister
Wife
Corona Virus
Positive

More Telugu News