rajnath singh: చైనాతో ఉద్రిక్త పరిస్థితులపై రాజ్‌నాథ్‌ సింగ్ స్పందన

rajnath on china
  • సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం
  • మిలిటరీ, దౌత్య పరమైన చర్చలు జరుగుతున్నాయి
  • అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి‌తో మాట్లాడాను
  • చైనాతో చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పాను
లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ విషయంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే చర్యలను తాము అడ్డుకుని తీరతామని అన్నారు. చైనాతో ఏర్పడిన సమస్య పరిష్కారానికి ఈ విషయంపై మిలిటరీ, దౌత్య పరమైన చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాను భారత్‌-చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై రాజ్‌నాథ్ స్పందిస్తూ.. తాను అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్‌ టీ ఎస్పెర్‌తో మాట్లాడానని, ఈ సమస్యను చైనాతో చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పినట్లు తెలిపారు. చైనాతో గతంలోనూ ఇటువంటి సమస్యలు తలెత్తాయని ఆయన గుర్తు చేశారు. పొరుగు దేశాలతో భారత్‌ సత్సంబంధాలు కొనసాగించేందుకు స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుందని చెప్పారు.
rajnath singh
India
China

More Telugu News