Corona Virus: 24 గంటల్లో దేశంలో మరో 6,566 మందికి కరోనా నిర్ధారణ

  • గత 24 గంటల్లో 194 మంది మృతి
  • కేసుల సంఖ్య మొత్తం 1,58,333
  • మృతుల సంఖ్య 4,531
  • 86,110 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
Spike of  COVID19 cases

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,566 మందికి కొత్తగా కరోనా సోకగా, 194 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,58,333కి చేరగా, మృతుల సంఖ్య 4,531 చేరుకుంది. 86,110 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67692 మంది కోలుకున్నారు.

  • Loading...

More Telugu News