జయలలిత ఆస్తులకు వారసులు వీరే: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
- జయ వారసులు దీప, దీపక్
- జయ ఆస్తులు వీరిద్దరికే చెందుతాయి
- వేద నిలయంలో సీఎం కార్యాలయం, మ్యూజియం ఏర్పాటు చేయండి
జయ నివాసమైన వేదనిలయంలో సగభాగాన్ని సీఎం కార్యాలయంగా, మిగిలిన సగభాగాన్ని ఆమె స్మారకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్నాడీఎంకే నేత పుహలేంది వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. తమ సూచనలపై సమాధానం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 8 వారాల గడువు ఇచ్చింది. వేద నిలయం విలువ రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందని... అందువల్ల జయ వారసులకు కూడా దీని విషయంలో నోటీసులు ఇవ్వాలని, వారి వాదనలను కూడా వినాలని చెప్పింది.