Corona Virus: దేశంలో 24 గంటల్లో 6,767 మందికి కొత్తగా కరోనా

  • 24 గంటల్లో 147 మంది మృతి
  • కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,867
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,31,868
  • 73,560 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
Highest ever spike of 6767  COVID19 cases

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,767 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 147 మంది ప్రాణాలు కోల్పోయారు.
               
దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,867కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,31,868కి చేరింది. 73,560 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

More Telugu News