మే 22న విపక్షాల సమావేశానికి పిలుపునిచ్చిన సోనియా గాంధీ
- కరోనా సంక్షోభంపై చర్చ
- వలస కార్మికుల సమస్యలపై పార్టీల అభిప్రాయం కోరనున్న సోనియా
- 20 పార్టీల నేతలకు ఆహ్వానం
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేఎంఎం అగ్రనేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి, ఆర్జేడీ పార్టీ నేత తేజస్వి యాదవ్ తదితరులను ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 20 పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది.