Corona Virus: ఏపీలో మరో 57 మందికి కరోనా నిర్ధారణ

coronavirus cases in ap
  • గత 24 గంటల్లో 9,739 శాంపిళ్ల పరీక్ష
  • 69 మంది డిశ్చార్జ్‌
  • మొత్తం కరోనా కేసులు 2,339
  • ఆసుపత్రుల్లో 691 మంది చికిత్స
ఏపీలో పరీక్షలు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,739 శాంపిళ్లను పరీక్షించగా మరో 57 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 69 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,339 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 691 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,596 మంది డిశ్చార్జ్ అయ్యారు.  24 గంటల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో చిత్తూరు జిల్లాలకు చెందిన వారు ఒకరు, కర్నూలు జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 52కి చేరింది.
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News