Telangana: తెలంగాణలో కరోనా విజృంభణ... ఇవాళ కోలుకున్న వారి కంటే కొత్త కేసులే ఎక్కువ!

Telangana corona positive cases total hiked
  • కొత్త కేసుల సంఖ్య 47
  • జీహెచ్ఎంసీ పరిధిలో 40 కేసులు గుర్తింపు
  • ఇవాళ 13 మంది డిశ్చార్జి
తెలంగాణలో కరోనా మహమ్మారి మరింతగా ప్రబలుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ 47 కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 40 కేసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు వెలుగుచూడగా, ఇద్దరు వలస కార్మికులకు కరోనా నిర్ధారణ అయింది. మరణాల సంఖ్య 34 అని ప్రభుత్వ బులెటిన్ లో పేర్కొన్నారు. ఇక ఇవాళ కోలుకున్న వారి సంఖ్య 13 మాత్రమే. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1414 కాగా, ఇప్పటివరకు 952 మంది డిశ్చార్జి అయ్యారు. 428 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Telangana
Corona Virus
Positive Cases
Discharge
GHMC
COVID-19

More Telugu News