ప్యాకేజీపై ఇన్వెస్టర్ల గంపెడాశలు... భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్!
- రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీపై కన్ను
- రెండు శాతానికి పైగా లాభాల్లో సూచీలు
- హెల్త్ సెక్టార్ మినహా మిగతా అన్నీ లాభంలోనే
నిఫ్టీ-50లో 45 కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగ సంస్థలు, బ్యాంకులు, సిమెంట్, వాహన కంపెనీల ఈక్విటీ వాటాల విలువ నాలుగు నుంచి ఐదు శాతం మేరకు పెరిగింది. హెల్త్ సెక్టార్ నష్టాల్లో నడుస్తోంది. కమోడిటీ మార్కెట్ల విషయానికి వస్తే, బంగారం ధర స్వల్పంగా లాభపడగా, వెండి ధర స్వల్పంగా నష్టపోయింది. పది గ్రాముల బంగారం ధర రూ. 16 పెరిగి రూ. 45,641 వద్ద, కిలో వెండి ధర రూ. 66 తగ్గి రూ. 42,988 వద్దా కొనసాగుతున్నాయి. క్రూడాయిల్ ధర మరో అరశాతానికి పైగా పతనమైంది.