ఏపీ ఇచ్చిన జీవో నెం.203పై తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆగ్రహం
- ప్రతిరోజూ 10 టీఎంసీల తరలింపుకు యత్నం అంటూ ఆరోపణలు
- కృష్ణా నది మొత్తాన్ని మళ్లించే కుట్ర అంటూ వ్యాఖ్యలు
- జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడి
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తూ తీసుకువచ్చిన ఈ జీవోపై ప్రభుత్వం సమీక్షించాలని కోరారు. పోతిరెడ్డిపాడు ద్వారా 7 టీఎంసీలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీలు ప్రతిరోజూ తరలించేందుకు ఏపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఆయా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొద్దిరోజుల క్రితమే ఏపీ సర్కారు జీవో జారీ చేసిందని, ఇది మొత్తం కృష్ణానదిని మళ్లించే కుట్రపూరిత పథకం అని మండిపడ్డారు.