Telangana: ఏపీ ఇచ్చిన జీవో నెం.203పై తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆగ్రహం

Telangana retired engineers fires on GO issued by AP Governmenr
  • ప్రతిరోజూ 10 టీఎంసీల తరలింపుకు యత్నం అంటూ ఆరోపణలు
  • కృష్ణా నది మొత్తాన్ని మళ్లించే కుట్ర అంటూ వ్యాఖ్యలు
  • జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడి
తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఏపీ సర్కారు ఇచ్చిన జీవో నెం.203పై అభ్యంతరం వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 10 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ ఈ జీవో ఇచ్చిందని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తూ తీసుకువచ్చిన ఈ జీవోపై ప్రభుత్వం సమీక్షించాలని కోరారు. పోతిరెడ్డిపాడు ద్వారా 7 టీఎంసీలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీలు ప్రతిరోజూ తరలించేందుకు ఏపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఆయా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొద్దిరోజుల క్రితమే ఏపీ సర్కారు జీవో జారీ చేసిందని, ఇది మొత్తం కృష్ణానదిని మళ్లించే కుట్రపూరిత పథకం అని మండిపడ్డారు.
Telangana
Retired Engineers
Krishna River
Andhra Pradesh
GO No.203

More Telugu News