తల్లి గురించి చెబుతూ భావోద్వేగాలకు గురైన రోజా
- ఇవాళ మదర్స్ డే
- తల్లిని జ్ఞప్తికి తెచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా
- తనను ఓ మంచి మనిషిగా తీర్చిదిద్దిందంటూ కితాబు
తామందరం జీవితంలో స్థిరపడ్డామని, ఇలాంటి స్థితిలో తమ పిల్లలతో ఆడుకోవాల్సిన అమ్మ ఈ లోకంలో లేకపోవడం తీరని లోటు అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా కన్నీటిపర్యంతం అవుతానని, అయితే అమ్మ లేని లోటును తన భర్త తీరుస్తున్నాడని రోజా వెల్లడించారు. తల్లి చూపిన బాటలోనే తాను కూడా తన పిల్లల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంటానని, వాళ్ల కోరికలన్నీ తీర్చుతుంటానని వివరించారు.