షార్ లో పని చేసే ఝార్ఖండ్ వలస కార్మికుల ఆందోళన!
- రెండు వందల మంది కార్మికుల ఆందోళన
- పోలీసులను తోసేసిన కార్మికులు.. కార్మికులపై లాఠీఛార్జి
- షార్ లోపల బస్సుల, భవనాల అద్దాలు పగలగొట్టిన కార్మికులు
ఈ నేపథ్యంలో రెండు వందల మంది వలస కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసులను తోసుకుంటూ పోయిన కార్మికులు, షార్ లోపల ఉన్న బస్సుల అద్దాలను, భవనాల అద్దాలను పగలగొట్టారు. ఈ క్రమంలో కార్మికులపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. షార్ లోపల నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు. ఆందోళనకు దిగిన కొందరు కార్మికులను బస్సుల్లో పోలీసులు తరలిస్తున్నట్టు సమాచారం.