తబ్లిగీ జమాత్ చీఫ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కరోనా.. క్వారంటైన్ కు మరో 12 మంది!
- వైద్య పరీక్షల్లో ఇద్దరు పోలీసులకు కరోనా పాజిటివ్
- కరోనా బారిన పడిన ఢిల్లీ పోలీసుల సంఖ్య 100 దాటిన వైనం
- తబ్లిగీ చీఫ్ పై ఈడీ దర్యాప్తు కూడా ప్రారంభం
మరోవైపు మౌలానా సాద్తోపాటు అతడి సన్నిహితుల ఖాతాల్లోకి గల్ఫ్ దేశాల నుంచి కోట్లాది రూపాయలు వచ్చి పడినట్టు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా తాము సేకరించిన వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అందించారు. దీంతో ఈ సొమ్ము హవాలా మార్గంలో వచ్చిందా? లేక మనీలాండరింగ్కు పాల్పడ్డారా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.