Corona Virus: ఆంధ్రప్రదేశ్‌లో మరో 71 మందికి కరోనా.. కర్నూలులో కేసులు 386కు చేరిన వైనం

coronavirus cases in ap
  • గత 24 గంటల్లో  6,497 మంది శాంపిళ్ల పరీక్ష
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,403
  • ఇప్పటివరకు 321 మంది డిశ్చార్జ్  
  • చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,051
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,497 మంది శాంపిళ్లను పరీక్షించగా 71 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,403గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని వివరించింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,051గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 2, గుంటూరులో 4, కడపలో 4, కృష్ణాలో 10, కర్నూలులో 43, నెల్లూరులో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో మొత్తం కేసులు 386కు చేరాయి.

జిల్లాల వారీగా వివరాలు..                      
                                      
గ్రాఫ్ రూపంలో..     
         
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News