జట్టుకట్టిన ఎయిర్ టెల్, నోకియా.. రూ. 7,500 కోట్ల డీల్!
- 5జీ రెడీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయనున్న నోకియా
- 3 లక్షలకు పైగా బేస్ స్టేషన్ల నిర్మాణం
- 5జీ సేవలకు పునాదిరాయన్న నోకియా ప్రెసిడెంట్ రాజీవ్ సూరి
డీల్ తొలి దశలో ప్రస్తుతానికి 4జీ సేవలకు ఉపయోగపడే 3 లక్షల పైచిలుకు బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసే నోకియా, 5జీ తరంగాలు రాగానే, వాటిని అప్ గ్రేడ్ చేస్తుంది. భవిష్యత్తులో అప్ గ్రేడ్ చేసుకునేందుకు అనువుగా ఈ బేస్ స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టుతో ఎయిర్ టెల్ నెట్వర్క్ సామర్థ్యం మరింతగా మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డ నోకియా ప్రెసిడెంట్ రాజీవ్ సూరి, ఈ డీల్ 5జీ సేవలకు కూడా పునాదిరాయిగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాగా, 2025 నాటికి 8.8 కోట్ల వరకూ 5జీ కనెక్షన్లు ఉంటాయని నిపుణుల అంచనా.