ఇంటివద్దే ప్రార్థనలు నిర్వహించుకోవాలి: సీఎం కేసీఆర్

 CM KCR Urged the people to offer their prayers staying home
  • రంజాన్ మాసం ప్రారంభం సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు
  • కరోనా  నేపథ్యంలో బయటికి రావొద్దని సూచన
  • కేసీఆర్ సందేశాన్ని ట్వీట్ చేసిన సీఎంఓ
రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇంటి వద్దనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని ముస్లింలకు సూచించారు. ప్రజలెవరూ బయటికి రావొద్దని అన్నారు. ఈ పవిత్ర మాసం మన సమాజంలో సామరస్యం, సంతోషం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు  సీఎం సందేశాన్ని తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది.
Go Back to Shorts
KCR
urged
people
offer
prayers
staying home
Ramzaan

More Telugu News