నిజామాబాద్ లో పీపీఈ కిట్స్ ధరించిన బ్యాంకు ఉద్యోగులు!
- రెడ్ జోన్ లో ఉన్న నిజామాబాద్ లోని ఎస్బీఐ బ్రాంచ్
- ప్రతి ఉద్యోగికి రెండు జతల పీపీఈ కిట్స్
- ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిట్స్ ధరిస్తున్నామన్న ఉద్యోగులు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెడ్ జోన్ లో ఉన్న బ్రాంచ్ లకు పీపీఈ కిట్స్ అందిస్తున్నారని, ప్రతి ఉద్యోగికి రెండు జతల పీపీఈ కిట్స్ ఇచ్చారని ఆ బ్యాంకు ఉద్యోగి ఒకరు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఆర్థిక సాయం తాలూకు డబ్బును తీసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుకు వస్తున్నారని అన్నారు.