అమెరికాలో మరో కలకలం.. రెండు పెంపుడు పిల్లులకు కరోనా
- న్యూయార్క్ జూలోని సింహాలు, పులులకు ఇప్పటికే కరోనా
- ఇప్పుడు పెంపుడు పిల్లులకు సోకిన మహమ్మారి
- శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పిల్లులు
కరోనా బారినపడిన రెండు పిల్లులు శ్వాసకోశ సమస్యతో బాధపడుతుండడంతో పరీక్షించగా వాటికి కరోనా వైరస్ సోకిన విషయం బయటపడింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిలో పెంపుడు జంతువుల పాత్ర ఉండే అవకాశం లేదని వైద్యాధికారులు పేర్కొన్నారు. ఈ పిల్లులను పెంచుకుంటున్న వారి కుటుంబంలో ఎవరికీ కరోనా సోకలేదని అధికారులు చెప్పడం గమనార్హం. కరోనా సోకిన బయటి వ్యక్తుల నుంచి వీటికి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, న్యూయార్క్ జూలో ఎనిమిది సింహాలు, పులులకు ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే.