కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడ పెళ్లిపై సీఎం యడియూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు
- ఆ పెళ్లిపై సానుకూలంగా వ్యాఖ్యలు
- ఆ పెళ్లి గురించి చర్చించాల్సిన అవసరమేమీ లేదు
- అవసరమైన అనుమతులన్నీ ఇచ్చాం
- ఆ వివాహం కూడా చాలా సింపుల్గానే జరిగింది
ఈ పెళ్లికి సుమారు 60 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే, ఈ పెళ్లి నేపథ్యం కుమారస్వామి కుటుంబంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. లాక్డౌన్ నేపథ్యంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందిపోయి ఇలా వ్యవహరించడమేంటని చాలా మంది ప్రశ్నించారు.
దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందిస్తూ, ఆ పెళ్లిపై సానుకూలంగా వ్యాఖ్యానించారు. ఆ పెళ్లి గురించి చర్చించాల్సిన అవసరమేమీ లేదని, ఇందుకోసం అవసరమైన అనుమతులన్నీ ఇచ్చామని తెలిపారు. ఆ వివాహం కూడా చాలా సింపుల్గానే జరిగిందని వివరణ ఇచ్చారు.
లాక్డౌన్ నేపథ్యంలో వారి పరిమితుల్లో బాగానే చేశారని అన్నారు. అందుకు తాను వారిని అభినందిస్తున్నాని కూడా యడియూరప్ప అనడం గమనార్హం. కాగా, ఈ వివాహంపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ రాంనగర్ డిప్యూటీ కమిషనర్కు యడియూరప్ప ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.