Telangana: తెలంగాణలో కరోనా విజృంభణ...ఇవాళ కొత్తగా 43 కేసులు!

Corona positive cases raises in Telangana
  • 809కి చేరిన పాజిటివ్ కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 31 కేసుల గుర్తింపు
  • 186 మంది డిశ్చార్జి
కరోన మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పాకుతోంది. ఇవాళ ఒక్కరోజే 43 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 809కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 605 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న 186 మందిని డిశ్చార్జి చేశారు. కాగా, కొత్తగా నమోదైన 43 కేసుల్లో 31 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తించారు. గద్వాల్ జిల్లాలో 7, సిరిసిల్ల జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.
Telangana
Corona Virus
Positive Cases
Deaths
COVID-19

More Telugu News