వచ్చే ఏడాదికల్లా కరోనాకు టీకా సిద్ధం చేస్తాం: సీరం సంస్థ
- నెల రోజుల్లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభం
- వాక్సిన్కు పేటెంట్ కూడా తీసుకోం
- సీరం సంస్థ సీఈఓ అదర్ పూర్ణావాలా వెల్లడి
ఈ టీకాకు తాము పేటెంట్ తీసుకోమని అదర్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ సిద్ధమయ్యాక అది అవసరం ఉన్న దేశాలు వివిధ సంస్థలతో కలిసి దాన్ని తయారు చేసుకోవచ్చని చెప్పారు. తద్వారా అది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందన్నారు. మన కన్నా ముందు ఏ దేశం కరోనా టీకాను కనిపెట్టినా ఇదే పద్ధతిని పాటించాలని సూచించారు. కరోనా లాంటి మహమ్మారి వ్యాపించి ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు ఎవ్వరూ లాభం గురించి ఆలోచించకూడదన్నారు. పరిశోధన సంస్థలు అన్ని దేశాల ప్రజల బాగుండాలని కోరుకోవాలని సూచించారు.