సామాజిక దూరం పాటిస్తూ టీకాలు: ఏపీ ప్రభుత్వం ప్రకటన
- శిశువులు, పిల్లలు, గర్భిణీలకు తక్షణమే ఇస్తున్నట్టు ప్రకటన
- సబ్ సెంటర్, గ్రామ, వార్డు సచివాలయాలు, ఈయూ పీహెచ్సీల్లో అందుబాటులో టీకాలు
- రెడ్ జోన్లకు మాత్రం మినహాయింపు
టీకాలను ఆశా వర్కర్లు వేస్తారని చెప్పింది. వాళ్లు టీకాలు ఇచ్చే సమయాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేస్తారని తెలిపింది. ఆయా కేంద్రాల్లో ప్రతి 30 నిమిషాల్లో నలుగురికి మాత్రమే టీకాలు ఇస్తారని, ఇందుకోసం వారికి ముందుగానే స్లాట్స్ను కేటాయిస్తారని చెప్పింది. టీకాలు ఇచ్చే సమయంలో వారి మధ్య ఐదు నుంచి ఏడు అడుగుల దూరం పాటిస్తారని ప్రభుత్వం తెలిపింది.