ప్రపంచవ్యాప్తంగా 38 వేలు దాటిన కరోనా మరణాలు... ఇటలీలో మరణమృదంగం!
- ఇటలీలో 11 వేలు దాటిన కరోనా మరణాలు
- స్పెయిన్ లో 8 వేల పైచిలుకు మరణాలు
- ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8.01 లక్షలు
ఇక, ఫ్రాన్స్ లోనూ కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. అక్కడ 3,024 మంది ప్రాణాలు కోల్పోగా, ఇరాన్ లో 2,898 మంది బలయ్యారు. బ్రిటన్ లో 1,408, నెదర్లాండ్స్ లో 864, జర్మనీలో 651 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 8.01 లక్షలకు చేరింది. కరోనాతో ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద 38,749 మంది మరణించినట్టు గుర్తించారు.