ప్రీపెయిడ్ ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పిన బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్
- వ్యాలిడిటీ గడువు పెంచిన సంస్థలు
- బీఎస్ఎన్ఎల్ వచ్చే నెల 20 వరకు,
- ఎయిర్టెల్ ఏప్రిల్ 17 వరకు పెంపు
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఏప్రిల్ 20 వరకు వ్యాలిడిటీ గడువును పెంచుతున్నట్టు ప్రకటించింది. అదనంగా పది రూపాయల టాక్టైంను ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ విపత్కర సమయంలో ఈ టాక్టైం ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొంది. మరో టెలికం సంస్థ ఎయిర్టెల్ కూడా తమ ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటి గడువును వచ్చే నెల 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, రూ. 10 టాక్టైమ్ను కూడా ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది.