ఔటర్ రింగ్రోడ్డుపై దారుణం.. బోలేరో ట్రక్కును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు కూలీల దుర్మరణం
- పనులు లేక స్వగ్రామానికి వెళ్తున్న కూలీలు
- పెద్ద గోల్కొండ సమీపంలో ఢీకొన్న లారీ
- ప్రమాద సమయంలో వాహనంలో 30 మంది కూలీలు
ఈ ఘటనలో బొలేరో డ్రైవర్ సహా ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఆరుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఓ చిన్నారి, బాలిక ఉన్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ నూజివీడు నుంచి గుజరాత్కు మామిడి కాయల లోడుతో వెళ్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.