సీపీఎం దాతృత్వం... 20 వేల మందికి భోజన వితరణ
- లాక్డౌన్తో పస్తులుంటున్న పేదలు, కూలీలు
- విజయవాడ సింగనగర్ ప్రాంతంలో బాధితులు
- ఇళ్లకు వెళ్లి భోజనం అందించిన నేతలు, కార్యకర్తలు
ఈ సందర్భంగా పలువురు సీపీఎం నేతలు మాట్లాడుతూ ప్రజల బాధ్యతను గుర్తు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, కూలీలపట్ల తమ బాధ్యతను విస్మరించారని విమర్శించారు. రోజు కూలీపై ఆధారపడే వారు నానా పాట్లు పడుతున్నారని, వారికి వలంటీర్ల ద్వారా భోజన సదుపాయం కల్పించాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు కేజీల బియ్యం, వెయ్యి రూపాయలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు.