Road Accident: మెదక్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ.. ఐదుగురి మృతి.. 20 మందికి తీవ్ర గాయాలు

bus accident in medak
షార్ట్స్‌లో చూడండి
మెదక్‌ జిల్లా సంగయ్య పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొల్చారం మండలం సంగయ్య పేట వద్ద ఓ ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలు, ఐదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందారు.  

మరో 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారందరినీ పోలీసులు, సహాయక సిబ్బంది కలిసి మెదక్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను సంగారెడ్డి మండలం ఫసల్‌వాది వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు సొంత గ్రామం నుంచి ఏడుపాయలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు.
Go Back to Shorts
Road Accident
Medak District

More Telugu News