రాహుల్ సిప్లిగంజ్ పై దాడి నిందితుల కోసం పోలీసుల విస్తృత గాలింపు.. బెంగళూరులో ఎమ్మెల్యే సోదరుడు!
- గత బుధవారం గచ్చిబౌలి పబ్లో రాహుల్పై దాడి
- నిందితుల కోసం గాలిస్తున్న రెండు బృందాలు
- బెంగళూరుకు పారిపోయినట్టు అనుమానం
రాహుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సోదరుడు రితీశ్రెడ్డితో పాటు ఆయన అనుచరులు బెంగళూరుకు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు వారి కోసం అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, నిందితులు అక్కడి నుంచి ముందస్తు బెయిలు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.